టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో మార్కులకు సంబంధించి షార్ట్ మెమోలను ఎస్సెస్సీ బోర్డు ఇంతకుముందే విడుదల చేసిందని, ఈ షార్ట్ మెమోల్లో ఏమైనా సవరణలు అవసరమైతే వెంటనే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి జూలై 8న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టెన్త్ షార్ట్ మెమోలలో సవరణలకు అవకాశం
టెన్త్ ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్ లో సరైన వివరాలు నమోదు చేసేందుకు వీలుగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సవరణలు అవసరమైతే ఆయా స్కూళ్ల రికార్డు, నామినల్ రోల్, హెచ్ఎం సంతకం చేసిన షార్ట్ మెమోతో డైరెక్టరేట్ కార్యాలయానికి జూలై 18వ తేదీలోగా పత్రాలను సమర్పించాలని సూచించారు.