Skip to main content

Good News for Students : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 15 రోజులు సెల‌వులు.. ఈ తేదీల్లోనే..

విద్యార్థుల‌కు రెండో శ‌నివారం వ‌చ్చినా, ఆదివారం వ‌చ్చినా ఎంతో ఎగిరి గంతులేస్తారు. అంటే, రెండు రోజులు వ‌రుస‌గా సెల‌వులు వ‌స్తాయి కాబ‌ట్టి. అదే ఒక వారం లేదా ఏకంగా 15 రోజుల‌పాటు సెల‌వులు ఉంటే ఇంక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు.
Government declares 15 days holidays for education institutions  Haryana government announcement of school holidays  Haryana government decision on winter holidays

సాక్షి ఎడ్యుకేష‌న్: సెల‌వులంటేనే విద్యార్థుల‌కు పండుగ‌. అందులోనూ ఇది చ‌లికాలం.. దీంతో రోజురోజుకి చ‌లి తీవ్ర‌త పెర‌గ‌డం, వ‌ర్షాలు ప‌డ‌డం వంటివి జ‌రిగేస‌రికి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్య సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తుంటారు ప్ర‌భుత్వాలు. ఇక దేశంలో చలి తీవ్రత కూడా ఎంతో పెరుగుతూనే ఉంది.

Holidays List 2025 : వ‌చ్చే ఏడాది 2025లో 50 రోజులకు పైగా సెల‌వులు... ఎలా అంటే..? ఈ టెక్నిక్ పాటిస్తే...!

ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోయింది.

విద్యాసంస్థ‌ల‌కు ఏకంగా 15రోజులు..

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌తీ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. దీంతో హర్యానా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ విపరీతమైన చలి ఉండటంతో ఏకంగా రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌, అంగన్‌వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలో తీవ్రమైన చలికాల పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్ర‌భుత్వం. ఈ మెర‌కు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

School Fees: స్కూళ్ల ఫీ‘జులుం’కు చెక్‌!.. ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా..

చ‌లి తీవ్ర‌త కార‌ణంగా.. ప్రభుత్వ, ప్రైవేట్-ఎయిడెడ్ పాఠశాలల పాఠశాల సమయాలను ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటలకు మార్చారు. వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలను చలి నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 16వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్య‌..

ఇదిలా ఉండగా, చలికాలంలో విద్యార్థులు ఎక్కువగా అనారోగ్యం బారినపడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ సహా ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా అనుసరించాలని పాఠశాలల యాజమాన్యాన్ని విద్యాశాఖ కోరింది. కాని, బోర్డు పరీక్షలు రాసే 10, 12వ తరగతుల విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Dec 2024 08:59AM

Photo Stories