Jobs: నియామకాలకు ఆర్టీసీ శ్రీకారం

కోవిడ్‌ బారినపడి మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగ్‌లు ఇచ్చే ప్రక్రియకు సంస్థ శ్రీకారం చుట్టింది.
నియామకాలకు ఆర్టీసీ శ్రీకారం

ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని రీజనల్‌ మేనేజర్లను ఆర్టీసీ యాజమాన్యం అక్టోబర్‌ 26న ఆదేశించింది. కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల వారసుల దరఖాస్తులను నిర్దేశిత విధానంలో అక్టోబర్‌ 30వ తేదీలోగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపించాలని కోరింది. వారిని నవంబర్‌ 30వ తేదీలోగా ఉద్యోగాల్లో నియమించనుంది. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టినందుకు సీఎం జగన్, ఆర్టీసీ యాజమాన్యానికి నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్ అధ్యక్షుడు ఆర్‌.రమణారెడ్డి అక్టోబర్‌ 26న కృతజ్ఞతలు తెలిపారు. 

చదవండి: 

ఇదే కృషితో ఐఏఎస్‌ కొట్టాలి: సీఎం

UGC NET: యూజీసీ నెట్‌ పరీక్షల తేదీలు

#Tags