కరోనా, ఇతర కారణాలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నెట్ (నేషనల్ ఎలిజిబులిటీ టెస్టు)ను నవంబర్ 20 నుంచి నిర్వహించనున్నారు.
యూజీసీ నెట్ పరీక్షల తేదీలు
ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబర్ 5 వరకు ఇవి కొనసాగుతాయి. అంతకుముందు ఈ పరీక్షలను అక్టోబర్ 6 నుంచి నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారు. వేరే పరీక్షలు కూడా అదే రోజుల్లో ఉండడంతో వీటిని వాయిదా వేశారు. తర్వాత అక్టోబర్ 17 నుంచి నిర్వహించాలని భావించినా అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి.