Tribal Students: గిరిజన విద్యార్థులకు మెరుగైన ‘వసతి’

తిరుపతి అర్బన్‌ : గిరిజన వసతి గృహాల్లోని పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి బి.సూర్యనారాయణ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని మొత్తం 6 గిరిజన హాస్టళ్లలో 420 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. వారి బాగోగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

చ‌ద‌వండి: Collector: విద్యాధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

#Tags