Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
తిరుపతి ఎడ్యుకేషన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ వరకు గడువు పొడిగించారు.
ఈ మేరకు తిరుపతిలోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ఎలా చేసుకోవాలి వంటి పూర్తి వివరాలకు తమ సమాచార కేంద్రాన్ని నేరుగా లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదింవచ్చని ఆయన కోరారు.
#Tags