Skip to main content

Gurukulam Spot Admissions: ‘గురుకులం’ స్పాట్‌ అడ్మిషన్లలో గందరగోళం

మడికొండ: మడికొండలోని (వర్ధన్నపేట) బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలో సెప్టెంబ‌ర్ 12న‌ నిర్వహించిన స్పాట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది.
Confusion in Gurukulam spot admissions

రాత్రి ఎనిమిది గంటలైనా అధికారులు సీట్లు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల వద్ద కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు తల్లిదండ్రులు గుక్కెడు నీటి కోసం అల్లాడారు.

చదవండి: Samantha 10th Class Marks sheet: సమంత ఏం చదువుకుందో తెలుసా? నటనలోనే కాదు, చదువులోనూ టాపర్‌!

ఆర్‌సీఓ, డీసీఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించారు. కాగా, సీట్ల కేటాయింపు వివరాలు ఫోన్‌ ద్వారా తెలుపుతామని జోనల్‌ ఇన్‌చార్జ్‌ స్వరూపరాణి తెలిపారు. సీట్లు నిబంధనల ప్రకారం కేటాయించకుండా అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నరని విద్యార్థులు, తల్లిందండ్రులు ఆరోపించారు.

Published date : 14 Sep 2024 10:02AM

Photo Stories