Degree Results: విడుదలైన డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు..

నిర్వహించిన డిగ్రీ పరీక్షలకు ఫలితాలు విడుదలైయ్యాయన్నారు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌. పరీక్షకు హాజరైన సంఖ్యను తదితర వివరాలను వెల్లడించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను సోమవారం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ మారెడ్డి అంజిరెడ్డి విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 88 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న నాలుగు సంవత్సరాల హానర్స్‌ డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో బాలికలు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు.

Free Training: బైక్‌ రిపేరీలో ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖస్తులు..

తమ యూనివర్శిటీ నూతనంగా ఏర్పాటైనప్పటికీ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనను సకాలంలో నిర్వహించగలిగామన్నారు. మొత్తం 8124 మంది విద్యార్థులు మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో 7201 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. 3309 మంది విద్యార్థులు (46 శాతం) ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

#Tags