Distance Education: ఓపెన్‌ ఇంటర్‌కేంద్రం

నారాయణపేట రూరల్‌: జిల్లా కేంద్రంలో సార్వత్రిక, దూరవిద్య ద్వారా ఇంటర్‌ చదువుకునే విద్యార్థులకు మరో అభ్యాసన కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

స్థానిక శ్రీసాయి జూనియర్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌లో సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులతో పాటు స్థానికంగానే ప్రాక్టికల్స్‌ నిర్వహణ చేపట్టనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ విభాగాల్లో ఇంగ్లిష్‌, తెలుగు మీడియంలో చేరడానికి అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్‌, కోఆర్డినేటర్‌ రామకృష్ణ 99080 69789ని సంప్రదించవచ్చు.

Also read:UP స్కూలు టీచర్‌ వినూత్న ప్రయత్నం: ‘ప్యాడ్‌ బ్యాంక్‌’

#Tags