Job Mela: డీఎల్‌టీసీ ఐడీఐ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని బలగ ఆస్పత్రి జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ ఐడీ ఐ శిక్షణ కేంద్రం వేదికగా జ‌నవ‌రి 10వ తేదీన జాబ్‌మేళా జరగనుందని జిల్లా ఉపాధి అధికా రి కొత్తలంక సుధ తెలిపారు.

పేటీఎంలో ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 300 పోస్టులు, డీమార్ట్‌లో క్యాషియర్స్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 100 పోస్టులు, రక్ష సెక్యూరిటీలో సెక్యూరిటీ గార్డ్స్‌ 50 పోస్టుల భర్తీ కోసం ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి కనీసం టెన్త్‌ ఉత్తీర్ణులైన పురుషులు అర్హులని పేర్కొన్నారు.

చదవండి: 267 Jobs: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆకర్షణీయమైన జీతంతోపాటు ఇతర రాయితీలు, అలవెన్సులు ఉంటాయని ఆమె చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బుధవారం ఉదయం 10.30 గంటలకు తమ బయోడేటాతోపాటు సర్టిఫికెట్లు, జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌కార్డుతో నేరుగా డీఎల్‌టీసీ ఐటీఐ శిక్షణ కేంద్రం వద్దకు చేరుకోవాలని ఉపాధి అధికారి సుధ తెలిపారు.

#Tags