AP EDCET 2023: బీఏ (ఓఎల్) విద్యార్థులకు బీఈడీ అవకాశం
ఏయూ క్యాంపస్: బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్సెట్ 2023కు బీఏ (ఓఎల్) కోర్సు పూర్తి చేసిన వారికి సోషల్ స్టడీస్ మెథడాలజీలో అర్హత కల్పిస్తున్నట్లు ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఎడ్సెట్ షెడ్యూల్లో మార్పులు చేశామని,అర్హులైనవారు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.1,000 అపరాధ రుసుముతో మే 22 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
చదవండి: Education: జైలు పాఠాలు.. శిక్షను శిక్షణగా మారుస్తున్నారు
దరఖాస్తులో తప్పులను మే 26 నుంచి 30 వరకు సరిచేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్లను జూన్ 2 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూన్ 14న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చదవండి: బీఈడీ–2023 షెడ్యూల్ విడుదల
#Tags