‘పింగిళి’ డిగ్రీ ఫలితాలు విడుదల

విద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్‌) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 10న‌ విడుదల చేశారు.
‘పింగిళి’ డిగ్రీ ఫలితాలు విడుదల

కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.చంద్రమౌళి ఫలితాలను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 276 మంది(59.61 శాతం) మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పింగిళి కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రామకృష్ణారెడ్డితో పాటు రేణుక, శిరీష, సుహాసిని, పార్వతి, రాజేశ్వరి, గంప రజిత, మాధవి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

#Tags