Telangana University: 5 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పీజీ రెగ్యులర్‌ పరీక్ష ఫీజును డిసెంబర్‌ 5వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ అరుణ న‌వంబ‌ర్‌ 17న‌ తెలిపారు.

ఎంబీఏ, ఎంసీఏ, ఐఎంబీఏ కోర్సుల్లో 3, 9వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు ఈ షెడ్యూల్డ్‌ వర్తిస్తుందన్నారు. రూ. వంద అపరాధ రుసుముతో డిసెంబర్‌ 6వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు.

చదవండి: Telugu University: ప్రతిభా పురస్కారాలు ప్రదానం.. పురస్కార గ్రహీతలు వీరే...

తెయూ పరిధిలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ www.telanganauniversity.co. inను సంప్రదించాలని సూచించారు.

#Tags