లెక్చరర్ల వేతనం పెంపు

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది.
లెక్చరర్ల వేతనం పెంపు

దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభిస్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ జూలై 29న ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గరిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల గెస్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు.

చదవండి:

#Tags