TS CPGET 2023: పీజీ ప్రవేశాల తొలి జాబితా విడుదల తేదీ ఇదే
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూతో పాటు ఇతర యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నట్లు టీఎస్సీపీజీఈటీ–2023 కన్వీనర్ పాండురంగారెడ్డి సెప్టెంబర్ 27న ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం 45 వేల సీట్లకు 33 వేల మంది నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో వర్సిటీ, ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కళాశాలల్లో 25 వేల నుంచి 30 వేల సీట్ల వరకు భర్తీ చేయనున్నట్లు వివరించారు. సీటు లభించిన అభ్యర్థులు అక్టోబరు 4 వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
చదవండి:
#Tags