ANGRAU: బీఎస్సీలో ‘ఎన్‌ఆర్‌ఐ’ సీట్ల దరఖాస్తుకు గడువు పెంపు

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయం, కమ్యూనిటీ సైన్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి మూడవ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామారావు నవంబర్‌ 15న ఒక ప్రకటనలో తెలిపారు.
బీఎస్సీలో ‘ఎన్‌ఆర్‌ఐ’ సీట్ల దరఖాస్తుకు గడువు పెంపు

ఎన్‌ఆర్‌ఐ కోటాలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గడువు తేదీని నవంబర్‌ 25వ తేదీ వరకూ పెంచినట్లు పేర్కొన్నారు.

చదవండి: ప‌ద‌మూడు కొత్త వంగడాల రూపకల్పన

అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేసుకునే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా విశ్వవిద్యాలయానికి చేరేలా పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ https://angrau.ac.in/ను సంప్రదించాలని కోరారు.

చదవండి: ఈ కోర్సులకు గిరాకీ

#Tags