MJPTBCWREIS: వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) తన పరిధిలోని వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ(ఆనర్స్)లో మొదటి ఏడాది ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంసెట్–2023 ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని, బీసీ గురుకుల వెబ్సైట్లో జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు జూలై 9న ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 040–23328266కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
చదవండి:
Agricultural Engineering: ప్రవేశ పరీక్షలో డిల్లేశ్వరికి ఫస్ట్ ర్యాంకు
#Tags