Agricultural Engineering: ప్రవేశ పరీక్షలో డిల్లేశ్వరికి ఫస్ట్ ర్యాంకు
Sakshi Education
అనకాపల్లిటౌన్: వ్యవసాయ ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సు ప్రవేశ పరీక్షలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరి శోధనాస్థానానికి చెందిన విద్యార్థి ఆర్.డిల్లేశ్వరి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించారు.
స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో జూలై 3న ఆమెను ఏడీఆర్ పి.వి.కె.జగన్నాథరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఏఆర్ఎస్కు చెందిన విద్యార్థులు టి.హరిణ, ఉమామహేశ్వరరావు, బి.స్మైలీ, పి.అశ్రిత,జి.ఎన్.డి.ఫణిశ్రీ వరుసగా 3, 4, 5, 7, 8 ర్యాంకులు సాధించారని తెలిపారు. పరిశోధనాస్థానం ప్రిన్సిపాల్ఎస్.వి.ఎస్.గోపాలస్వామి పాల్గొన్నారు.
చదవండి:
TS EAMCET 2023: అప్లికేషన్ల వెల్లువ.. ఏ రాష్ట్రం నుంచి ఎన్ని దరఖాస్తులు?
Published date : 04 Jul 2023 05:21PM