DR.B.R.Ambedkar Gurukulam: ఈ తేదీ లోపు అంబేడ్కర్ గురుకులాల్లో చేరాలి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించిన సీట్ల కేటాయింపు పూర్తి అయ్యిందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి మే 27న ఓ ప్రకటనలో తెలిపారు.
ఐదో తరగతి ప్రవేశం కోసం పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మే 4న విడుదల చేశారన్నారు. విద్యార్థుల వెబ్ ఆప్షన్ మేరకు వారి మొబైల్ఫోన్లకు సీట్ల కేటాయింపు సమాచారం వస్తుందన్నారు. కేటాయించిన గురుకుల పాఠశాలల్లో జూన్ 4వ తేదీలోపు చేరాలని సూచించారు.
చదవండి:
బీసీ గురుకులాల్లో ఐఐటీ ప్రత్యేక కోచింగ్
విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్తో గురుకులాల్లో వినూత్నంగా బోధన
#Tags