Skip to main content

ఆకాశవాణి ద్వారా ఎంసెట్ శిక్షణ: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌తో లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి ఆన్‌లైన్ విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఏఫ్రిల్ 15 (బుధవారం)న తెలిపారు.
ఎంసెట్ ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, గెడైన్స్...ఇతర ఆప్‌డేట్స్ కొర కు క్లిక్ చేయండి.

ఈ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. రోజూ ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా వినవచ్చన్నారు. రేడియో సెట్ లేని విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌లో ఆల్ ఇండియా రేడియో మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా వినాలని సూచించారు.
Published date : 16 Apr 2020 06:28PM

Photo Stories