AP 10th Class Text Books : పదో తరగతి పాఠ్య పుస్తకంలో తప్పులు.. విద్యార్థులకు..
సాక్షి ఎడ్యుకేషన్ : పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లడంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
సీడీల్లో మార్పు వల్లే ఈ తప్పు జరిగినట్లు తెలిపింది. పదో తరగతిలో కొత్త సిలబస్ ప్రవేశ పెట్టామన్నారు. అయితే సీడీల్లో మార్పు వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పూ గోదావరి, కృష్ణా జిల్లాలకు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయంది. తప్పులున్న పేజీల స్థానంలో విద్యార్థులకు వారం రోజుల్లో అనుబంధ బుక్లెట్లు అందిస్తామని తెలిపింది.
#Tags