Entrance Test: గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్ష.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెం గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ స్వప్నకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల డిగ్రీ సెట్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకు ఏప్రిల్ 12వ తేదీ వరకు వరకు దరఖాస్తు గడువు ఉందని పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా 2024–25 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తామని, ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. ఇతర వివరాలకు https://tsrdccet.cgg.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.
#Tags