Athletics: జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌ కు ఎంపికైన విద్యార్థులు..

అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యాలయం విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం (జైనథ్‌) విద్యార్థులు జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి నిడ్జం అథ్లెటిక్స్‌ మీట్‌లో పాఠశాలకు చెందిన జశ్వంత్‌, లోకేష్‌, వినీత్‌, శౌర్యరాజ్‌, సాయికిరణ్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

Chartered Accountant: దేశాభివృద్ధిలో సీఏ ల పాత్ర మరింత కీలకం కావాలి..

ఈనెల 14నుంచి 18 వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్న 19వ జాతీయస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఆర్సీవో గోపీచంద్‌, ప్రిన్సిపాల్‌ రంగన్న, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ రాజేశ్‌, పీఈటీలు రాకేశ్‌, జ్యోతిశ్వరన్‌, ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు.

#Tags