PG Exam: పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ విద్యార్థులకు మూడో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో వర్సిటీతోపాటు నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు పేర్కొన్నారు. మొదటి రోజు 570 మంది విద్యార్థులకు 546 మంది హాజరు కాగా 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ ఆర్‌యూలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వర్సిటీ హాస్టల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు. వీసీ వెంట వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వెంకట సుందరానంద పుచ్చ ఉన్నారు.

చదవండి: Free Training Courses: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

#Tags