Admission in Andhra University: ఏయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల సందడి ఆరంభమైంది. అక్టోబర్ 9న ఏయూ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్ల కార్యాలయాలకు విద్యార్థులు చేరుకొని తమ అలాట్మెంట్ లెటర్లను అందజేశారు. సంబంధిత కళాశాలల పరిధిలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను పూర్తిచేశారు. ప్రవేశం పొందిన విద్యార్థుల సీట్ అలాట్మెంట్ లెటర్తో పాటు, అవసరమైన ఇతర సర్టిఫికెట్లను కళాశాల సిబ్బంది స్వీకరించారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి దశలో ప్రవేశాలు సాధించిన విద్యార్థులంతా వర్సిటీకి చేరుకుని తమ ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేస్తున్నారు.
చదవండి: Free Training: నర్సింగ్ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
#Tags