Skip to main content

Singareni: సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి నిధులు

రామగిరి: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి వెనుకాడదని, అవసరమైన నిధులు కేటాయిస్తుందని ఆర్జీ–3 జీఎం ఎన్‌.సుధాకర్‌రావు అన్నారు.
పనులు ప్రారంభిస్తున్న జీఎం సుధాకర్‌రావు
పనులు ప్రారంభిస్తున్న జీఎం సుధాకర్‌రావు

మంగళవారం సెంటనరీకాలనీ పబ్లిక్‌ పార్కులో రూ.8.06 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మరుగుదొడ్లు, రూ.2.52 లక్షలతో ఓపెన్‌ స్టేజీ పనులకు భూమిపూజ చేసి, ప్రారంభించారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితోపాటు ఉద్యోగుల రక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కాలనీవాసులు, పరిసర ప్రాంత ప్రజలు పార్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీవైపీఎం రవీందర్‌ రెడ్డి, సివిల్‌ డీజీఎం పద్మరాజు, సీనియర్‌ సెక్యూరిటీ అధికారి లక్ష్మీనారాయణ, డీవైపీఎం శ్రీహరి, సివిల్‌ డీవైఎస్‌ రామకృష్ణ, అధికా రుల సంఘం ప్రతినిధి టి.నాగేశ్వర్‌రావు, వివిధ సంఘాల నాయకులు గౌతం శంకరయ్య, ఎంఆర్‌సీ రెడ్డి, మధునయ్య, మామిడి స్వామి పాల్గొన్నారు.

Also read: Andhra Pradesh: Parents and Teachers Meeting in AP Govt Schools #sakshieducation

 

Published date : 23 Aug 2023 08:24PM

Photo Stories