Holiday : రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు బంద్.. కారణం ఇదే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను మార్చి 2వ తేదీన (గురువారం) బంద్ చేశారు.
ts junior colleges closed
శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతున్న సాత్విక్ బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఈ మృతికి శ్రీ చైతన్య యాజమాన్యమే కారణమని ఎస్ఎస్యూఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈమేరకు నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల ఘటనపై ఎన్ఎస్యూఐ స్పందించింది.సాత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాత్విక్ మృతికి నిరసనగా గురువారం శ్రీచైతన్య కళాశాలలను బంద్ చేయాలంటూ వారు పిలుపునిచ్చారు.