Skip to main content

Sri Chaitanya Student Satwik Suicide : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య.. మంత్రి సబిత కీలక నిర్ణయం

సాక్షి ఎడ్యుకేష‌న్ : శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Sabitha Indra Reddy Minister of Education of Telangana
Sabitha Indra Reddy, Minister of Education of Telangana

ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్‌ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 

Published date : 01 Mar 2023 06:38PM

Photo Stories