Skip to main content

School Assistant Promotions: మిగిలిపోయిన పోస్టులకు పదోన్నతి అవకాశం ఇవ్వాలి

Teacher receiving promotion order online   Tapas leaders discussing school assistant promotions  School Assistant Promotions  DEO Jaganmohan Reddy discussing promotion orders

జగిత్యాల: ఇటీవల స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టులను ప్రమోషన్‌ ద్వారా నింపాలని తపస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం డీఈవో జగన్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ప్రమోషన్లు ఆన్‌లైన్‌లో జరపడం వల్ల ఒక ఉపాధ్యాయుడికి ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో రెండు, మూడు చొప్పున ప్రమోషన్‌ ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.

TS Gurukulam: గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు.. వారికి తప్ప మిగిలిన వారికి అలాట్‌మెంట్‌

దీనివల్ల సీనియర్‌ లిస్టులో కింద ఉన్న టీచర్లు నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, విద్యాశాఖ ప్రకటించిన అన్ని సబ్జెక్టుల్లో మిగులు పోస్టులకు వెంటనే పదోన్నతి అవకాశం కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ అధ్యక్షుడు నరేందర్‌రావు, ఉపాధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవయ్య, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Published date : 21 Jun 2024 12:35PM

Photo Stories