Skip to main content

Prajavani: ‘ప్రజావాణి’ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి

Prajavani
‘ప్రజావాణి’ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి

వికారాబాద్‌ అర్బన్‌: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పరిధిలోని నుంచి 116 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు అందజేశారు. అనంతరం లింగ్యానాయక్‌ మాట్లాడుతూ.. ప్రజలు నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చి ఫిర్యాదులు చేస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండసీ్ట్రస్‌ జీఎం వినయ్‌కుమార్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చ‌ద‌వండి: పరిగి మోడల్‌ స్కూల్‌లో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం

Apprentice Mela: 23న ఐటీఐలో అప్రెంటిషిప్‌ మేళా

Published date : 22 Aug 2023 03:51PM

Photo Stories