Skip to main content

PM Modi : 5వ తరగతి విద్యార్థికి ప్రధాని మోదీ అభినందన‌లు.. ఎందుకంటే..?

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు అందుకున్న ఏపీఆర్‌ఎస్‌ కొడిగెనహళ్లి విద్యార్థి రాగే సూర్యప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
pm modi with children

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ద్యార్థి రాగే సూర్యప్రసాద్‌. ఈ విద్యార్థి ఏపీఆర్‌ఎస్‌ కొడిగెనహళ్లిలో 5వ తరగతి చదువుతున్నాడు.  సూర్యప్రసాద్‌.. గతేడాది కిలి మంజారోతో పాటు లద్దాఖ్‌లోని దక్షిణ పుల్లు పర్వతాన్ని అధిరోహించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుకు ఎంపిక చేసింది. జ‌న‌వ‌రి 22వ తేదీన‌ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. 

☛ Bal Puraskar Award 2024 Winners : చిన్నారులకు రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే..

జాతీయ స్థాయి అవార్డు దక్కడం..

రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న సూర్యప్రసాద్‌

సూర్యప్రసాద్‌తో పాటు రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుకు ఎంపికైన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సూర్యప్రసాద్‌ను అభినందించారు. తమ విద్యార్థి జాతీయ స్థాయి అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఏపీఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ మురళీధర్‌, ఉపాధ్యాయులు అన్నారు.

☛ Good News.. January 26,27,28 Holidays : జ‌న‌వ‌రి 26,27,28 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌ సెల‌వులు.. కార‌ణం ఇదే..!

Published date : 25 Jan 2024 02:53PM

Photo Stories