Skip to main content

What Is MyGoal: తెలంగాణ మండ‌లిని సంద‌ర్శించిన విద్యార్థులు

విద్యార్థులకు వాట్ ఈజ్ మై గోల్ సంస్థ అద్భుత‌మైన అనుభ‌వాల‌ను ఇచ్చింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని 50 పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులకు రాష్ట్ర అసెంబ్లీని సందర్శించే చాన్స్​ను క‌ల్పించింది. తెలంగాణ అసెంబ్లీలో కార్యాకలాపాలు ఏ విధంగా నిర్వ‌హిస్తారు, ప్రజా ప్ర‌తినిధులు కూర్చునే సీట్ల‌ను విద్యార్థుల‌కు తెలియ‌జేశారు.
students

వాట్ ఈజ్ మై గోల్ సంస్థ విద్యార్థుల అభిరుచ్చిల్ని సాకారం చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం విద్యార్థుల‌కు అసెంబ్లీని వీక్షించే అవ‌కాశం క‌ల్పించింది. అలాగే విద్యార్థులకు భారతీయ రాజకీయాలపై అవ‌గాహ‌న క‌ల్పించింది. కార్యక్ర‌మం అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా క‌నిపించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఇలాంటి కార్య‌క్ర‌మానికి అవ‌కాశం క‌ల్పించిన మంత్రి కేటీఆర్‌కు వారు అభినంద‌న‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో టీఎస్ఐసీ చీఫ్ ఇన్నొవేష‌న్ అధికారి డా.శాంత తౌట‌మ్, టీహబ్ సీఈవో శ్రీనివాస రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

students

 

Published date : 12 Apr 2023 04:59PM

Photo Stories