Telangana: ఈ పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
Covid 19
అలాగే ఒక ఉపాధ్యాయురాలు కూడా కరోనా పాజిటవ్ వచ్చింది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వైరస్ సోకిన వారిని హాస్టల్లో క్వారంటైన్లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది వైద్య అధికారులు చెప్పారు.