Skip to main content

Shiksha Award Ceremony: జిల్లా స్థాయి ముఖ్యమంత్రి శిక్షా పురస్కార ప్రదానోత్సవం

శనివారం జరిగిన సీఎం శిక్షా పురస్కార ప్రదానోత్సవంలో ఎంతోమంది ఎంఎల్‌ఏలు హాజరయ్యారు. ఉపాధ్యాయులందరికీ ఈ అవార్డులను ప్రదానం చేశారు.. ఈ వేడుకు వివరాలు..
Administrators presenting awards to teachers

జయపురం: స్థానిక దసరా పొడియ మైదానంలో శనివారం సాయంత్రం జిల్లా స్థాయి ముఖ్యమంత్రి శిక్షా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. 2128 మంది ఉపాధ్యాయులకు సీఎం శిక్షా అవార్డులను అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రామచంద్ర నాయిక్‌ స్వాగతోపన్యాసం చేయగా.. అవార్డు గ్రహీతలు ప్రసంగించారు. కార్యక్రమంలో కొరాపుట్‌ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళిక బోర్డు అధ్యక్షుడు రఘునాథ్‌ పడాల్‌, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి, పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్‌ పాఢీ, లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే ప్రభు జాని, జిల్లా పరిషత్‌ కార్యనిర్వాహక అధికారి దయామయ పాఢీ, సమన్వయ ఆదివాసీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ప్రణయ రంజన్‌ బెహరా, జయపుర మున్సిపల్‌ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయిక్‌, బీడీఓ శక్తి మహాపాత్రో, జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ రూపచంద్ర సొరెన్‌, అదనపు జిల్లా విద్యాధికారి జగన్నాథ భొత్ర, బీఈఓ చందనకుమార్‌ నాయిక్‌, జిల్లా విద్యా కోఆర్డినేటర్‌ భరత్‌ కుమార్‌ పాఢీ, బీఓ శ్రీకాంత కుమార్‌ జాని, టి.మీనతి తదితరులు పాల్గొన్నారు.

10th Exams: మార్చి 4న టెన్త్‌ పరీక్షలపై ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం

Published date : 26 Feb 2024 03:45PM

Photo Stories