Skip to main content

Acharya Nagarjuna University: నేటి నుంచి డిగ్రీ రెండో సెమిస్టర్‌ మూల్యాంకనం

Acharya Nagarjuna University Degree 2nd Semester Exams

ఒంగోలు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం నుంచి స్థానిక డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ప్రారంభమవుతుందని క్యాంప్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.కళ్యాణి పేర్కొన్నారు. సాయంత్రం 2 గంటల నుంచి 7 గంటల వరకు మూల్యాంకనం నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ అన్ని గ్రూపుల పేపర్లు, బీఏ ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, బీకాం అన్ని సబ్జెక్టుల పేపర్లు మూల్యాంకన కేంద్రానికి చేరాయని వివరించారు. చీరాల, మార్కాపురం, ఒంగోలులోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కాలేజీల అధ్యాపకులు రిలీవ్‌ తీసుకుని మూల్యాంకనానికి హాజరుకావాలని సూచించారు.

చ‌ద‌వండి: Employment Opportunities: నిరుద్యోగుల ‘ఉన్నతి’కి భరోసా

Published date : 07 Sep 2023 03:36PM

Photo Stories