Skip to main content

Tenth Class: పకడ్బందీగా పది పరీక్షలు.. హాల్‌ టికెట్లు ఇసారి ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Tenth Class
పకడ్బందీగా పది పరీక్షలు.. హాల్‌ టికెట్లు ఇసారి ఇలా..

పదో తరగతి పరీక్షల నిర్వహణపై మార్చి 18న‌ బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు హాల్‌ టికెట్లను మార్చి 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంతోపాటు, పాఠశాలలకు కూడా పంపుతున్నట్టు తెలిపారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. మొత్తం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

Published date : 20 Mar 2023 05:33PM

Photo Stories