సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించినందుకు వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు జూన్ 23న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
![Teachers unions are grateful to the CM](/sites/default/files/images/2024/06/25/cmrevanthreddy-1719290094.jpg)
పదిహేనేళ్లుగా పెండింగ్లో ఉన్న భాషా పండితులు, పీఈటీల అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరిస్తూ వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
చదవండి:
Gurukula Teachers: గురుకుల టీచర్లకూ అవే సౌకర్యాలివ్వాలి
Teachers Promotions : పీహెచ్డీ అర్హత లేకపోయినా ఉపాధ్యాయులకు పదోన్నతులు మంజూరు..!
Published date : 25 Jun 2024 10:04AM