Skip to main content

Pre Matric Scholarship: 9, 10 తరగతులకే: కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతన పథకాన్ని ఇకపై 9, 10వ తరగతి విద్యార్థులకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది.
Only students in classes 9th and 10th Class will be covered under Pre Matric Scholarship Scheme
ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం 9, 10 తరగతులకే: కేంద్రం

గతంలో ఒకటి నుంచి పదో తరగతి దాకా మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌ వచ్చేది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున వారికి ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది.

చదవండి: CBSE Scholarships: బాలికలకు సీబీఎస్‌ఈ ఆర్థిక చేయూత.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇకపై స్కాలర్‌షిప్‌ల కోసం 9, 10 తరగతి విద్యార్థుల దరఖాస్తులనే పరిశీలించాలని రాష్ట్ర, జిల్లా నోడల్‌ అధికారులకు సూచించింది. దీనిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా మరింత కుంగదీసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తంచేశారు.

చదవండి: Scholarships in NMMS: ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రూ.12వేల స్కాలర్‌షిప్‌

Published date : 30 Nov 2022 03:07PM

Photo Stories