Scholarship: జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అమలు చేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి సంబంధించిన పరీక్షలకు నవంబర్ 7వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ విద్యాశాఖ అవకాశం కల్పించింది.
జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు అక్టోబర్ 27న ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థుల దరఖాస్తులను హెచ్ఎంలు 9వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపాల్సి ఉంటుంది. వాటిని 11వ తేదీనాటికి జిల్లా అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు పంపుతారు.
వాస్తవానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 28తో ముగిసింది. అయితే దీపావళితో పాటు వరుస సెలవులు రావడంతో విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు పొందలేకపోయారని, దరఖాస్తు చివరి తేదీ పొడిగించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.