Skip to main content

NMMS Exam : 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఈనెల 8న ఎన్‌ఎంఎంఎస్ ప‌రీక్ష‌..

National means cum merit scholarship exam for 8th class students  NMMS 2024-25 exam for class 8 students announced for December 8  Announcement of NMMS exam date for 8th-grade students in Anantapur

అనంతపురం: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) ఈనెల 8న ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3,665 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.

Course Selection : డిగ్రీ పీజీ విద్యార్థులకు శుభవార్త‌.. ఇక‌పై స‌బ్జెక్టు ఎంపిక‌లో..

ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు www.bre.ap. gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని తెలిపారు. సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు పాఠశాల యూడైస్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అయి వారివారి విద్యార్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇంకా 251 మంది విద్యార్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేయలేదన్నారు. హెచ్‌ఎంలు చొరవ తీసుకుని ప్రతి విద్యార్థికీ హాల్‌టికెట్‌ అందజేసి పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Dec 2024 11:49AM

Photo Stories