నిజామాబాద్ నాగారం: అంబేడ్కర్ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఉపన్యాస పోటీల్లో ఆకాంక్ష భోంస్లే, అక్షిత, సాయిరాం, వ్యాసరచనలో శిల్పారాణి, తన్వి చందరాణా, ధీరజ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి నిర్వాహకులు బహుమ తులు, ప్రశంస పత్రాలు అందజేశారు. మోహన్ దాస్, నవత వినయకుమార్, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, కేంద్ర సిబ్బంది లత, హరీష్ పాల్గొన్నారు.