Skip to main content

Andhra Pradesh: ఆ ఇద్దరు విద్యార్థినులకు విదేశీ విద్య అందించాలి....

ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇద్దరు బీసీ విద్యార్థినులకు రూ.కోట్లలో ఆర్థిక సాయం చేసిన విషయం గురించి మాట్లాడుతూ, ఇలా సూచించారు..
mlc suryanarayana rao in meeting
mlc suryanarayana rao in meeting

సాక్షి ఎడ్యుకేష‌న్: విదేశీ విద్య పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇద్దరు బీసీ విద్యార్థినులకు రూ.కోట్లలో ఆర్థిక సాయం చేసి, వారి ప్రతిభకు పట్టం కట్టారని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌ సీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అప్పుడే నాకు తెలియకుండా నా ఫోటోలు తీశారు! ఇంకా ఎన్నో గెలవాలి!

ఇస్రో శాస్త్రవేత్తల విజయం, చంద్రయాన్‌–3 జాబిల్లిపై అడుగు పెట్టడంపై తొలుత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ, విదేశీ విద్య పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆర్థిక సాయం అందించిన ఇద్దరు విద్యార్థినులూ నాసాలో ప్రతిభ చాటి భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలుగా వస్తారని ఆకాంక్షించారు.
 

Published date : 26 Aug 2023 05:36PM

Photo Stories