Skip to main content

Army Recruitment Drive: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి

బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
31 people were killed in a stampede at an army recruitment rally

కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో న‌వంబ‌ర్‌ 20న‌ వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు.

చదవండి: Army Clarifies Emoluments After Agniveer's Death: ‘అగ్నివీర్‌’ అమరుడైతే సైనికులకు అందించే ప్రయోజనాలివే

యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. న‌వంబ‌ర్‌ 20న‌ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం న‌వంబ‌ర్‌ 21న‌ తెలిపింది.

Published date : 22 Nov 2023 03:06PM

Photo Stories