Skip to main content

Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

navodaya admissions
navodaya admissions

చిత్తూరు కలెక్టరేట్‌ : అన్నమయ్య జిల్లా వలస పల్లెలోని జవహర్‌ నవోదయ విద్యాలయాలో ఖాళీ సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని డీఈవో విజయేంద్రరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

తొమ్మిదవ తరగతికి ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023–24 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదివి ఉండాలన్నారు. 01–05–2009 నుంచి 31–07– 2011 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. 11వ తరగతికి పదవ తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. 01– 06–2007 నుంచి 31–07–2009 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2024 ఫిబ్రవరి 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని డీఈవో వెల్లడించారు.

Published date : 07 Oct 2023 04:27PM

Photo Stories