వైరా (ఖమ్మం జిల్లా): గురుకుల బాలికల(జనరల్) పాఠశాల విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు గాయపరిచిన ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది.
ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థినులు
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 23న శనివారం రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్న 9, 10వ తరగతుల విద్యార్థినుల కాలివేళ్లపైనా, చేతివేళ్లపైనా ఎలుకలు కొరకడంతో ఆ విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సెప్టెంబర్ 24న ఉదయం తెలుసుకున్న సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
విషయం తెలుసుకున్న డీఈఓ సోమశేఖరశర్మ సెప్టెంబర్ 27న పాఠశాలకు వచ్చి బాలికలతో మాట్లాడారు. డార్మెటరీ, డైనింగ్ హాల్లో ఎలుకలు సంచరించకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్ రమను ఆదేశించారు.