Skip to main content

Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

Quality education should be provided

తలమడుగు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డీఈవో ప్రణీత అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. అనంతరం స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో ఉపాధ్యాయులకు తొలిమెట్టుపై అందిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు చతుర్విద ప్రక్రియలు నేర్పించాలన్నారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ నోడల్‌ అధికారి రాజా శంకర్‌, సెక్టోరియల్‌ అధికారి నారాయణ, ఎంఈవో నారాయణ, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వినోద్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Free Education: విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయం’

Published date : 08 Aug 2023 03:44PM

Photo Stories