Talent Test: 5వ తరగతి విద్యార్థులకు మేధా సమ్మాన్ ప్రతిభా పరీక్షలు.. ఎప్పడు..?
Sakshi Education
ఒడియా మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు మేధా సమ్మాన్ ప్రవేశ పరీక్ష నిర్వహించే క్రమంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తేదీని ప్రకటించారు..
![Odia medium students getting ready for entrance test Announcement of date for Odia medium students Announcement of date for Odia medium students Medha Samman Pratibha Test for Fifth Class students Preparation session for Medha Samman exam announced](/sites/default/files/images/2024/03/23/medha-samman-pratibha-test-1711173601.jpg)
కవిటి: జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒడియా మాధ్యమం చదువుతున్న విద్యార్థుల భాషాభివృద్ధికి ఏపీ ఒడియా టీచర్స్ అసోసియేషన్ (అపోటా) చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయ్ అన్నారు. పెద్దమెళియాపుట్టుగలో ఈ మేరకు గురువారం మేధా సమ్మాన్ ప్రతిభ పరీక్ష నిర్వహణకు సన్నాహక సమావేశం నిర్వహించారు.
GATE Rankers: గేట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంజనీరింగ్ విద్యార్థులు
జిల్లాలో ఒడియా మాధ్యమం చదువుతున్న 5వ తరగతి పిల్లలకు ఏప్రిల్ 7న జిల్లా స్థాయి మేధా సమ్మాన్ ప్రతిభ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, టెక్కలి, మెళియాపుట్టి, పాతపాట్నం, భామిని మండలాల్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. దీనికి అన్ని ఏర్పాట్లు చేయాలని సభ్యులకు సూచించారు.
Published date : 23 Mar 2024 11:30AM