Skip to main content

Govt School: విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

Distribution of bicycles to students

కెలమంగలం: కెలమంగలం పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం తళి ఎమ్మెల్యే టి. రామచంద్రన్‌ 278 మంది విద్యార్థినీ విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలోనూ రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని, పరిష్కరించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరారు. వారం రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పిటిఏ అధ్యక్షులు చెన్నబసప్ప, పంయతీ అధ్యక్షులు దేవరాజ్‌, కౌన్సిలర్‌ ప్రభాజయరామన్‌ తదితరులు పాల్గొన్నారు.

బడిలో గుడి ప్రారంభం
క్రిష్ణగిరి: సూళగిరి తాలూకా బేరికె ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులచే నిర్మించిన వినాయక, చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయ కుంభాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైర్‌పర్సన్‌ లావణ్యమధు పాల్గొన్నారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మహా కుంభాభిషేకోత్సవం నిర్వహించారు.

Published date : 06 Sep 2023 05:53PM

Photo Stories