Students Skills: విద్యార్థుల ప్రతిభకు పతకాలు
![Students participated in skill demonstration](/sites/default/files/images/2023/10/04/students-1696421824.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం గొల్లమూడిపాడులో నిర్వహించిన నైపుణ్య ప్రదర్శనలో జిల్లా తరఫున హాజరైన 22 మంది ప్రతిభ కనబర్చి 11 పతాకాలు సాధించినట్లు సోంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బీపీఏ రాజు తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన నైపుణ్య ప్రదర్శనలో సోంపురం పాఠశాల నుంచి జిల్లా తరఫున ముగ్గురు విద్యార్థులు వి.రాజేష్, ఎన్.అజయ్, బి.చైతన్య వెళ్లారని చెప్పారు.
Written Exams for SI Posts: ఎస్ఐ పోస్టులకు తుది దశ పరీక్షలు
వీరు ఫస్ట్ ఎయిడ్, గాడ్జెట్స్, గ్లోబల్ వార్మింగ్ కల్చరల్ హెరిటేజ్, వాతావరణ మార్పులు, మార్చ్పాస్ట్ తదితర అంశాలపై జిల్లా బృందంతో కలిసి నైపుణ్యం ప్రదర్శించి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఎస్కార్ట్ టీచర్స్ ఎ.కనకలక్ష్మి, నాగేశ్వర్రావుల మార్గదర్శకత్వంలో విశేష ప్రతిభ కనబరచడంపై విద్యార్థులను ప్రశంసించారు.