Written Exams for SI Posts: ఎస్ఐ పోస్టులకు తుది దశ పరీక్షలు
![Preparations for SI final stage written exams](/sites/default/files/images/2023/10/04/si-exams-1696419448.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన ఎస్సై పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు నిర్వహించే తుది దశ పరీక్షలకు ఉన్నతాధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Employment Offer: స్థానికులకు ఉపాధి అవకాశం
దీనిలో భాగంగా ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్ నగరంలోని పలు కళాశాలలను మంగళవారం పరిశీలించారు. సీఆర్ఆర్ పాలిటెక్నిక్, మహిళా కళాశాల, డిగ్రీ కళాశాల, ఆర్ఆర్ పేటలోని సెయింట్ థెరిస్సా బాలికల కళాశాలను తనిఖీ చేశారు. ఈ కళాశాలల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై పరిశీలన చేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాత పరీక్షలను నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఉన్నారు.